ప్రముఖ దర్శకుడు శంకర్, లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన చిత్రం “భారతీయుడు”. అప్పట్లో ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్గా “ఇండియన్-2” టైటిల్ తో సినిమాను రూపొందిస్తున్నారు. ఆగస్ట్ నుండి చిత్ర షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, ప్రియా భావన శంకర్, ఐశ్వర్య రాజేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీలక పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఇందులో సిద్ధార్ద్, విద్యుత్ జమాల్, ఢిల్లీ గణేష్ ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. తాజాగా “ఇండియన్-2” చిత్రం నుంచి ప్రముఖ సినిమాటోగ్రఫర్ రవివర్మ తప్పుకున్నారు. 1996లో వచ్చిన “ఇండియన్”కి సీక్వెల్గా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ చిత్రంగా ‘ఇండియన్-2’ తెరకెక్కిస్తోంది. ప్రారంభంలోనే బ్రేక్ పడిన ఈ చిత్రం మళ్లీ తెరపైకి వచ్చేందుకు సిద్ధంకానుంది. ఇటీవల నిర్మాత సుభాస్కరన్ దర్శకుడు శంకర్తో కలిసి చిత్రం గురించి చర్చించినట్టు సమాచారం. ఆగస్టు 2వ వారంలో చిత్ర షూటింగ్ను ప్రారంభించనున్నట్టు ఆయన అనంతరం ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిత్రానికి సినిమాటోగ్రఫర్గా పనిచేసిన రవివర్మ తప్పుకోవడంతో రత్నవేల్ను కొత్తగా ఎంపిక చేసినట్లు లేటెస్ట్ సమాచారం. ఇప్పటికే శంకర్ రత్నవేల్ కాంబినేషన్లో ‘రోబో’ చిత్రం రూపుదిద్దుకుంది. ఆగస్టు 12వ తేదీన హైదరాబాద్లో చిత్ర షూటింగ్ ప్రారంభించనున్నట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
సిగ్గు లేకుండా వైసీపీలో జాయిన్ అయ్యారు ఛీఛీ… : శ్రీరెడ్డి