ఏపీ సర్కార్ పై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విరుచుకుపడ్డారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పై మండిపడ్డారు. నూతన ఇసుక పాలసీ విషయంలో సీఎం జగన్ రెండు అడుగులు ముందుకు-నాలుగు అడుగులు వెనక్కు వేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుతం తీవ్రమైన విత్తనాల కొరత నెలకొందనీ, ఈ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కన్నా డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో తీవ్రమైన వర్షాభవ పరిస్థితులు, కరవు నెలకొన్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో వెంటనే కరవు నివారణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. కర్ణాటకలో అంతర్గత కుమ్ములాటలు, అపవిత్ర పొత్తు కారణంగానే కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కూలిపోయిందని స్పష్టం చేశారు. ఇందులో తమ పార్టీ ప్రమేయం లేదని కన్నా స్పష్టం చేశారు.
మోదీ మళ్లీ ప్రధాని అయితే ఏం చేస్తారోనని భయం: శరద్ పవార్