కర్నాటక లో కాంగ్రెస్-జెడిఎస్ కూటమి ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గవర్నర్ వాజ్భాయ్ వాలాను యడ్యూరప్ప శుక్రవారం ఉదయం కలిశారు.
గవర్నర్ ను కలిసిన తర్వాత యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేసే ముహూర్తం ఖరారైంది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ నేతృత్వంలో బీజేపీ బృందం ఆ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ తాత్కాలిక అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలిశారు. దక్షిణ కర్ణాటక ప్రాంతంలో చోటు చేసుకొన్న పరిణామాలను వివరించారు. కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 105 స్థానాలతో అధికారం దక్కించుకొంది.
ప్రజల్లో విశ్వాసం కల్పించడం ఈసీ బాధ్యత: చంద్రబాబు