telugu navyamedia
రాజకీయ వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

జాతీయ ర‌హ‌దారుల‌పై..ఈనెల 20 నుంచి టోల్ వ‌సూల్!

Toll gate National highway

దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వ‌ర‌కు కేంద్రం పొడ‌గించిన విష‌యం తెలిసిందే. కానీ ఈనెల 20వ తేదీ నుంచి జాతీయ ర‌హ‌దారుల‌పై టోల్ టాక్స్ వసూల్ చేయ‌నున్నారు. తొలుత ప్ర‌క‌టించిన 21 రోజుల లాక్‌డౌన్ స‌మ‌యంలో.. అత్య‌వ‌స‌ర సర్వీసుల‌కు వెస‌లుబాటు క‌ల్పించేందుకు టోల్ ఫీజును ఎత్తివేశారు. దీంతో జాతీయ ర‌హ‌దారుల సంస్థ ఆదాయం అత్యంత ద‌య‌నీయంగా మారింది.

ఈ నేప‌థ్యంలో ఈనెల 20వ తేదీ నుంచి మ‌ళ్లీ టోల్ వ‌సూల్ చేసేందుకు ఎన్‌హెచ్ఏఐ నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. రాష్ట్రాల మ‌ధ్య వాహ‌నాల రాక‌పోక‌ల‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాల‌ని కేంద్ర హోంశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసిన నేప‌థ్యంలో టోల్ టాక్స్ మ‌ళ్లీ మొద‌లుపెట్టాల‌ని ఎన్‌హెచ్ఏఐ నిర్ణ‌యించిన‌ట్లు కేంద్ర రోడ్డు ర‌వాణ‌, హైవేల మంత్రిత్వ‌శాఖ ఓ లేఖ‌లో పేర్కొంది.

Related posts