భారత స్టార్ షట్లర్ పి.వి. సింధు ఇండోనేషియా సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో ఓటమి పాలయింది. ఈ సీజన్లో తొలి టైటిల్ను అందుకోవాలనుకున్న సింధుకు నిరాశే మిగిలింది. జపాన్ క్రీడాకారిణి అకానె యమగూచితో తలపడిన తుదిపోరులో 19-21, 16-21 తేడాతో తెలుగమ్మాయి ఓడింది. క్వార్టర్స్, సెమీస్లో అద్భుతంగా రాణించిన సింధు ఫైనల్లో 51 నిమిషాల్లోనే ప్రత్యర్థి ముందు తలవంచింది.
తొలిగేమ్ ఆరంభంలో యమగూచి అదరగొట్టినా తెలుగమ్మాయి 11-8తో గట్టి పోటీనిచ్చింది. కానీ తర్వాత ప్రత్యర్థి విజృంభించడంతో సింధు తొలిగేమ్ను దూరం చేసుకుంది. రెండోగేమ్లోనూ యమగూచి ఆధిపత్యం చెలాయించి టైటిల్ను కైవసం చేసుకుంది. యమగూచిపై విజయాల రికార్డు ఉన్న సింధు ఫైనల్లో ఓడటం గమనార్హం.