telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ మృతిపై మాజీ ప్రియురాలు పోస్ట్…!

Sushanth

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు పాల్పడి ఇవాల్టికి సరిగ్గా నెల రోజులు. సుశాంత్ మరణం ఆయనను అభిమానించే వారికీ తీరని విషాదాన్ని మిగిల్చింది. అయితే ఇప్పటి వరకు సుశాంత్ మృతిపై స్పందించని సుశాంత్ మాజీ ప్రియురాలు అంకిత లోఖండే తొలిసారిగా సుశాంత్ మరణంపై సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అంకితం లోఖండే తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా దేవుడి ముందు ఉంచిన దీపం ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోకు చైల్డ్ ఆఫ్ గాడ్ అని కామెంట్ కూడా పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సుశాంత్ మరణించిన తర్వాత అంకిత అతని ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. తల్లితో కలిసి సుశాంత్ ఇంటికి వెళ్లిన అంకిత కుటుంబ సభ్యులని పరామర్శించింది. ఇక సుశాంత్, అంకిత కలిసి ముందుగా టీవీ సీరియల్‌లో కలిసి నటించారు. 2009లో హిందీలో ప్రారంభమైన పవిత్ర రిష్తా అనే టీవీ సీరియల్ ద్వారా బుల్లితెరకు సుశాంత్ పరిచయం అయిన విషయం తెలిసిందే. ఏక్తా కపూర్ నిర్మించిన ఈ సీరియల్‌లో సుశాంత్ మానవ్ పాత్రలో టీవీ ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నాడు. ఇదే సీరియల్‌లో తనకి జోడీగా నటించిన అంకిత లోఖండేతో సుశాంత్‌ ప్రేమలో పడ్డాడు. దాదాపు ఆరేళ్లపాటు వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత సుశాంత్ సినిమాల్లోకి వచ్చేశాడు. 2016లో వీరిద్దరూ తమ ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్నారు.

Related posts