విజయనగర్కాలనీ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సి పాల్ బి రాధాక్రిష్ణమూర్తి, ఐటీఐలలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉపాధిని కల్పించే దిశగా జాబ్మేళాను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రానే ఇం జనర్ వాల్వ్ లిమిటెడ్, అస్ట్రా మైక్రో వేవ్స్ లిమి టెడ్, రిలయన్స్ జియో,జయభేరి ఆటో మోటివ్స్ లిమిటెడ్, ఇఫ్కాన్ ఇండియా ప్రవేట్ లిమిటెడ్, బృహస్పతి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లలో ఎలక్ట్రీషియన్స్,ఫిట్టర్, వెల్డర్స్, ఎలక్ట్రానిక్ మెకా నిక్,ఏవో కెమికల్స్,డీజిల్ మెకానిక్, కోపా తదితర ట్రేడ్లలో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు ఉపాధిని కల్పించేందుకు గాను జాబ్మేళాను నిర్వ హించడం జరుగుతుందన్నారు.
ఈ నెల 12 వతేదిన ఆసక్తి-అర్హత కలిగిన అభ్యర్థులు తమ విద్యా ర్హత ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఒక సెట్టు జిరాక్స్ కాపీలతో మల్లేపల్లి ఐటిఐ ప్రాంగణంలోని విజయ నగర్కాలనీ ప్రభుత్వ ఐటీఐలో నిర్వహించే జాబ్ మేళాకు హాజరు కావాలని కోరారు. మరింత సమాచారం కోసం 9347485438 నెంబర్లో సంప్రదించాలని కోరారు.