telugu navyamedia
సినిమా వార్తలు

సంగీత దర్శకుడిగా మారనున్న స్టార్ సింగర్

Sid-Sriram

సౌత్ లో ఇటీవల బాగా పాపులర్ అయిన సింగర్ సిద్ శ్రీరామ్. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన “గీతగోవిందం” సినిమాలో “ఇంకేం ఇంకేం కావాలే…” సాంగ్ తో టాలీవుడ్ లో మంచి గుర్తింపు లభించింది సిద్ శ్రీరామ్ కు. ఏఆర్. రెహమాన్ సాంగ్స్ తో ఎక్కువగా పాపులర్ అయిన సిద్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారనున్నాడు. అయితే ఈ సింగర్ గత కొన్నేళ్లుగా సంగీత దర్శకుడవ్వాలని ప్రయత్నాలు ఫలించాయి. మణిరత్నం నిర్మించనున్న మల్టీస్టారర్ ద్వారా ఈ కుర్ర సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారబోతున్నాడు. జివి.ప్రకాష్ కుమార్, విక్రమ్ ప్రభు, మడోన్నా సెబాస్టియన్ వంటి స్టార్స్ కలిసి నటిస్తున్న “వానం కొట్టాటూమ్” అనే తమిళ్ సినిమాకు ధనా శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. మణిరత్నం దగ్గర పలు సినిమాలకు సహాయ దర్శకుడిగా వర్క్ చేసిన శేఖర్ ఈ సినిమాను రియలిస్టిక్ గా తెరకెక్కిస్తున్నాడట. మొదట ఈ సినిమాకు 96 ఫేమ్ గోవింద్ వసంతని సంగీత దర్శకుడిగా అనుకున్నారు. కానీ ఇప్పుడు సిద్ శ్రీరామ్ కి అవకాశం ఇచ్చారు.

Related posts