telugu navyamedia
రాజకీయ వార్తలు

పార్టీ సభ్యత్వ నమోదుకోసం.. హైదరాబాద్‌ చేరుకున్న అమిత్‌షా

TDP Mla anitha comments Roja YCP

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ రోజు హైదరాబాద్‌ చేరుకున్నారు. ఆయనకు బీజేపీ నేతలు శంషాబాద్‌ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా బాలాపూర్‌ మండలం మామిడిపల్లి సమీపంలోని రంగనాయక తండా చేరుకుంటారు. సోనీ నాయక్‌ అనే గిరిజన మహిళకు పార్టీ సభ్యత్వం ఇచ్చి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

సాయంత్రం 4.30 గంటలకు కేఎల్‌సీసీ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకుని పార్టీ సభ్యత్వ నమోదును లాంఛనంగా ప్రారంభిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు నోవాటెల్‌ హోటల్‌లో పార్టీ ముఖ్య నాయకులతో జరిగే విందు సమావేశానికి హాజరవుతారని చెప్పారు. రాత్రి 9 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళతారు. సీఐఎస్‌ఎఫ్‌ ఉన్నతాధికారులతో శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

Related posts