ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈమె భౌతికాయాన్ని తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులతో సందర్శించి నివాళులు అర్పించారు. అనివార్య కారణాల వల్ల చంద్రబాబు నాయుడు హాజరు కాలేకపోయారు. దీంతో ఇవాళ కృష్ణను చంద్రబాబు పరామర్శించారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పరామర్శించారు. ఆదివారం ఉదయం చంద్రబాబు కుటుంబసమేతంగా కృష్ణ ఇంటికి వచ్చారు. విజయనిర్మల చిత్రపటానికి నివాళులర్పించారు.
చంద్రబాబుతో పాటు ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ ఉన్నారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ విజయనిర్మల మరణ వార్త చాలా బాధ కలిగించిందని అన్నారు. ఇంతకుముందు ఒకసారి ఆమెను కలిసానని, తాను చాలా ఆప్యాయంగా, సంతోషంగా మాట్లాడారని అన్నారు. ఆమె నటిగా కాకుండా రాజకీయ నాయకురాలిగా దగ్గర సంబంధాలు ఉన్నాయన్నారు. 1999లో తెలుగుదేశం పార్టీ తరఫున కైకలూరులో ఆమె పోటీ చేశారని చెప్పారు.