టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్ బాబు వరుస హిట్లతో విపరీతమైన క్రేజ్ తో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. ఆయన నటించిన “భరత్ అనే నేను”, “మహర్షి” సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ అయ్యాయి. దీంతో ఆయన నటిస్తున్న 26వ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేశ్ 26 చిత్రంగా “సరిలేరు నీకెవ్వరు” సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో మహేశ్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. విజయ్ శాంతి కీలక పాత్రలో కనిపించనున్నారు. అనీల్ రావిపూడి దర్శకుడు. అనీల్ సుంకర, దిల్రాజు, మహేశ్ నిర్మాతలు. జూలై మొదటివారంలో సినిమా షూటింగ్ కాశ్మీర్లో మొదలు కానుంది. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలు కాకుండానే శాటిలైట్ డీల్ క్లోజ్ అయ్యింది. ప్రముఖ టీవీ ఛానెల్ జెమిని టీవీ ఈ శాటిలైట్ హక్కులను ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. ఎంత మొత్తానికి శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్నారో తెలీదు కానీ… హక్కులను సొంతం చేసుకున్న విషయాన్ని మాత్రం ట్విట్టర్ ద్వారా కన్ఫర్మ్ చేసింది.
previous post
శ్రీరెడ్డి నిన్ను వదలా… ఎంతమందితో… : రాకేష్ మాస్టర్ ఫైర్