లవ్ స్టోరీలను యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా కుటుంబం మొత్తం కలిసి చూసేలా తెరపై అందంగా రూపొందించగల టాలీవుడ్ ప్రముఖ దర్శకులలో శేఖర్ కమ్ముల కూడా ఒకరు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి కథానాయికగా తెరకెక్కిన “ఫిదా” చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం తరువాత మరో ప్రాజెక్టును చేయడానికి శేఖర్ కమ్ముల చాలా సమయం తీసుకున్నాడు. తాజాగా ఆయన ప్రాజెక్ట్కి సంబంధించి అఫీషియల్ ప్రకటన వెలువడింది. టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల తన కొత్త ప్రాజెక్ట్ చేయనున్నాడనేది ఈ ప్రకటన సారాంశం. మలయాళ బ్యూటీ సాయి పల్లవి ఈ చిత్రంలో చైతన్యకు జోడిగా నటించనుంది. ఆగస్ట్ మొదటి వారం నుండి చిత్ర రెగ్యులర్ షూటింగ్ జరగనుందని అంటున్నారు. నాగ చైతన్య ఇటీవలే “మజిలీ” చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య “వెంకీ మామ” సినిమాతో బిజీగా ఉన్నాడు.
previous post