telugu navyamedia
సినిమా వార్తలు

అతడిని సిన్సియర్ గా ప్రేమించాను… కానీ… స్టార్ హీరోయిన్ కామెంట్స్

Kiara Advani images

మహేష్ “భరత్ అనే నేను” చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన కియారా అద్వానీ ఆ సినిమా భారీ హిట్ కావడంతో ఆ తరువాత బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఆమె నటించిన “అర్జున్ రెడ్డి” హిందీ రీమేక్ “కబీర్ సింగ్” సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా తన ప్రేమ కబుర్ల గురించి చెప్పుకొచ్చింది. పదవ తరగతిలోనే ఒక అబ్బాయిని సిన్సియర్ గా ప్రేమించానని,

కానీ తన తల్లి చదువుపై దృష్టి పెట్టమని మందలించడంతో అతడికి బ్రేకప్ చెప్పానని చెప్పి షాక్ ఇచ్చింది కియారా. అయితే ఇప్పుడు తనకు ప్రేమించడానికి సమయం లేదని, తన కెరీర్ పైనే పూర్తిగా దృష్టి పెట్టినట్లు తెలిపింది. చాలా కాలంగా బాలీవుడ్ లో ఆమె నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన ఆమె వాటిల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. మొదట్లో ఇలాంటి వార్తలు చదివినప్పుడు అప్సెట్ అయ్యేదాన్ని. కానీ ఇప్పుడు కాదు… ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్లు కామన్ అని అంటోంది కియారా.

Related posts