ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సీఈవోగా ఉన్న ఆర్కే జైన్ పదవీకాలాన్ని కేంద్రం మరో 6 నెలలు పొడిగించింది. కేంద్ర జలవనరుల శాఖ సిఫారసు మేరకు నియామకాల కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్గా ఉన్న ఆర్కే జైన్ పీపీఏ సీఈవోగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు చరవేగంగా జరుగుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతిరోజూ పాజెక్ట్ సందర్శన కోసం వందల మంది తరలివస్తున్నారు. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ సందర్శన కోసం ప్రత్యేక బస్సులను నడిపింది.