telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వైసీపీకి టీడీపీ ఓపెన్ ఛాలెంజ్‌..175 స్థానాల్లో గెలిస్తే .. టీడీపీ ఆఫీస్‌కి తాళం వేస్తాం

*వైసీపీకి టీడీపీ ఓపెన్ ఛాలెంజ్‌..
*ప్ర‌భుత్వానికి ర‌ద్దు చేయాల‌ని ఎన్నిక‌ల‌కు రావాల‌ని స‌వాల్‌
*175 సీట్లు వైసీపీ గెలిస్తే టీడీపీ ఆఫీస్ తాళాలు వేస్తామన్న అచ్చెన్నాయుడు

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ ప్ర‌భుత్వానికి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చెబుతున్న‌ట్లుగా 175 స్థానాల్లో వైసీపీ గెలిస్తే టీడీపీ కార్యాల‌యానికి తాళాలు వేస్తామంటూ ఆయన సవాల్ విసిరారు.

రాష్ర్టంలో 175 స్థానాల్లో గెలుస్తామ‌ని జ‌గ‌న్‌కు న‌మ్మ‌కం ఉందా? అని అచ్చెన్నాయుడు ప్ర‌శ్నించారు. అదే న‌మ్మ‌కం ఉన్న‌ట్లైతే జ‌గ‌న్ ఇప్పుడే ఎన్నికల‌కు వెళ్లాల‌ని ఆయ‌న స‌వాల్ విసిరారు. త‌క్ష‌ణ‌మే గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేస్తున్న‌ట్లు జ‌గ‌న్ ప్ర‌క‌టించాల‌ని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఏం చేశార‌ని 175 స్థానాల్లో వైసీపీ ని ప్ర‌జ‌లు గెలుపిస్తార‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌లు మ‌ళ్లీ జ‌గ‌న‌కే ఓట్లేసేంత అమాయ‌కులు కాద‌ని అన్నారు.

ఇకపోతే.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 175కు 175 స్థానాలు గెల‌వాల్సిందేన‌ని సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. వారికి 8 నెల‌ల డెడ్‌లైన్ పెట్టారు. ఆ లోపు ప్ర‌తి ఒక్క‌రిలోనూ మార్పు రావాల్సిందేన‌ని , సున్నితంగా హెచ్చ రించారు.

Related posts