హేమమాలిని, బీజేపీ సీనియర్ నేత, మథుర అభ్యర్థి గా మరోసారి భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్లోని మథుర నుంచి బరిలోకి దిగిన ఆమె.. తన సమీప ప్రత్యర్థి, ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి నేత కున్వర్ నరేంద్ర సింగ్పై ఏకంగా 2,93,471 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ స్థానం నుంచి హేమమాలిని గెలవడం ఇది రెండోసారి. 2014 ఎన్నికల్లో ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరిపై 3,30,743 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్ పాఠక్ 28,084 ఓట్లు మాత్రమే సాధించి మూడో స్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 350 స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ కూటమి 91 స్థానాలను గెలుచుకుంది. ఇతరులు 101స్థానాల్లో విజయం సాధించారు.
కల్వకుంట్ల జగన్ మోదీ రెడ్డి: లోకేష్