యూట్యూబ్లోనూ .. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఇందుకోసం ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్, ప్రసార భారతి తొలిసారిగా చేతులు కలిపాయి. గురువారం ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన సంబంధిత సమాచారమంతటినీ ప్రత్యేక యూట్యూబ్ ఛానెల్ ద్వారా ‘డీడీ న్యూస్’ ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తుందని ప్రసార భారతి సీఈవో శశిశేఖర్ వెంపటి తెలిపారు.
ఆ రోజు మనదేశంలో వెబ్సైట్ ద్వారాగానీ, యాప్ద్వారాగానీ యూట్యూబ్ను ఓపెన్ చేస్తే అన్నింటికంటే పైన ఎన్నికల ఫలితాల ప్రత్యక్ష ప్రసారమే కనిపిస్తుందని వెల్లడించారు. 14 భిన్న భాషల్లో ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని చూసే అవకాశం కల్పిస్తామన్నారు.