ఇవాళ వరల్డ్కప్ వార్మప్ మ్యాచ్లో భాగంగా బంగ్లాదేశ్తో భారత్ తలపడుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నది. తొలి వార్మప్ మ్యాచ్లో కివీస్ చేతిలో భారత్ దారుణంగా ఓడిన విషయం తెలిసిందే. అయితే రెండవ మ్యాచ్కు మాత్రం జట్టులో ఎటువంటి మార్పులు లేవు.
కేదార్ జాదవ్ ఇంకా ఫిట్గా లేడని కోహ్లీ తెలిపాడు. ఇంగ్లండ్కు వచ్చిన రెండు రోజుల్లోనే వార్మప్ మ్యాచ్ ఆడామని, అందుకే సరిగా పర్ఫార్మ్ చేయలేకపోయినట్లు కోహ్లీ చెప్పాడు. కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనున్నది.