తెలంగాణ లోని కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రవేశపెట్టనున్న ‘అంతిమయాత్ర.. ఆఖరి సఫర్’ పథకంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసలు కురిపించారు. ఈ పథకం వివరాలు తెలుసుకున్న ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. ‘కులమతాలు, పేద ధనిక బేధభావం లేకుండా అంతిమసంస్కారాల కోసం ప్రత్యేక పథకాన్ని రూపొందించిన కరీంనగర్ కార్పొరేషన్, మేయర్ రవీందర్సింగ్కు అభినందనలు’అంటూ వెంకయ్యనాయుడు ట్వీట్లో పేర్కొన్నారు.
కరీంనగర్ నగర పరిధిలో ఎవరు చనిపోయినా ఒక్క రూపాయికే వారి అంత్యక్రియలు నిర్వహిస్తామని, అందుకోసం ‘అంతిమయాత్ర.. ఆఖరి సఫర్’ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్టు కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్ నిన్న ప్రకటించారు. జూన్ 15 లోగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
కమిటీల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం: కన్నా