మరోసారి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత పాలకులు హోలీ, దీపావళి పండుగలకు కాకుండా మొహరం, ఈద్ పండుగల సందర్భంగా విద్యుత్ సరఫరా చేసే వారని సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. యూపీలోని సిద్ధార్థనగర్ జిల్లా దోమరాయగంజ్ పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎం యోగి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
గతంలో పాలకులు ఈద్ రోజు తప్ప హోలీ రోజు విద్యుత్ సరఫరా చేయలేదని వ్యాఖ్యానించారు. గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, రమజాన్ మాసంలో విద్యుత్ సరఫరా చేస్తే, దీపావళి రోజు కూడా విద్యుత్ అందించాలన్నారు. అఖిలేష్ మామ శివపాల్ యాదవ్ కు సోదరి లేకుంటే, ఇప్పుడు ఈ అత్త ఎక్కడి నుంచి వచ్చిందని యోగి మాయావతినుద్ధేశించి విమర్శలు గుప్పించారు.