ప్రజాస్వామ్యంలో ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ప్రశ్నించే హక్కు ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గోవింద్రాలలో టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడిన కాంగ్రెస్ కార్యకర్తలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ని వీడిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే గ్రామాల్లో పర్యటించాలని అన్నారు.
ఎమ్మెల్యే హరిప్రియను గోవింద్రాల గ్రామానికి చెందిన మహిళలు కాంగ్రెస్ పార్టీనీ వీడి, తమను ఎందుకు మోసం చేశారని ప్రశ్నించారు. ఈ క్రమంలో మహిళలు అని కూడా చూడకుండా టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయించడం దారుణమన్నారు.