హైదరాబాద్లో దారుణం జరిగింది. నేరేడ్మెట్ ఆర్కేపురంలో ఓ తండ్రి కన్నకొడుకుని తుపాకితో కాల్చి చంపాడు. వివరాల్లోకి వెళితే.. మహీరుద్దీన్ అనే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ప్రస్తుతం ఓ బ్యాంక్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. సోమవారం అర్ధరాత్రి ఇంటర్ చదువుతున్న 22 ఏళ్ల అతని కుమారుడు సోహెల్ను మహీరుద్దీన్ ఒక్కసారిగా గన్తో కాల్చి చంపాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు.
తుపాకి శబ్దం విని వచ్చిన ఇరుగు పొరుగువారికి అప్పటికే రక్తపు మడుగులో ఉన్న సోహైల్ కనిపించాడు. ఈ ఘటనకు ముందు తండ్రీ కొడుకుల మధ్య ఘర్షణ జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మహీరుద్దీన్ను అదుపులోకి తీసుకున్నారు.సలు. కుటుంబ కలహాలే హత్యకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.
సేవామిత్ర డేటా దొంగిలించి వైసీపీకి ఇచ్చారు: చంద్రబాబు