హైదరాబాద్ మూసాపేట సర్కిల్ పరిధిలోని రిలయన్స్ సెల్ టవర్లకు విద్యుత్ కనెక్షన్ శుక్రవారం జీహెచ్ఎంసీ అధికారులు కట్ చేశారు. స్థానికంగా ఉన్న 23 సెల్టవర్స్కు సంబంధించి ఆస్తిపన్ను చెల్లించకపోవడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ ఆదేశాల మేరకు ఆయా టవర్స్కు సంబంధించిన విద్యుత్ కనెక్షన్లను తొలగించారు. మూసాపేట, మోతీనగర్ ప్రాంతాల్లో రిలయన్స్ టవర్లు ఎక్కువగా ఉన్నాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఆస్తిపన్నుకు సంబంధించిన ఉన్నతాధికారులతో పాటు స్థానిక సర్కిల్ అధికారులు కనెక్షన్లు తొలగించారు. దీంతో ఆ ప్రాంత వినియోగదారులు సిగ్నల్ లేక ఇబ్బందులకు గురైనట్టు సమాచారం.
previous post
next post
ఇంధన శాఖ కార్యదర్శి చెప్పినా జగన్ వినలేదు: చంద్రబాబు