గత రెండు రోజులుగా శేషాచలం అడవుల్లో మంటలు చెలరేగుతున్నాయి. చామలకోన, గాడికోన ప్రాంతాల్లో ఈ మంటలు వ్యాపించాయి. శుక్రవారం ఉదయం నుంచి మంటలార్పేందుకు తితిదే అటవీ సిబ్బంది యత్నిస్తున్నారు. శ్రీవారి పాదాల వైపు అటవీప్రాంతంలో, రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో మంటలు వ్యాపిస్తున్నాయి.
ఎండాకాలంలో ఇది సహజం అయినప్పటికీ, ఇంత భారీగా అగ్ని విరుచుకుపడటం ఇదే మొదటిసారి అంటున్నారు అధికారులు. ఆ మంటలు వ్యాపించకుండా తగిన జాగర్తలు తీసుకుంటున్నారు అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదంలో ఆస్తి, ప్రాణ నష్టాల గురించి ఇంకా తెలియాల్సి ఉంది.