telugu navyamedia
రాజకీయ వార్తలు

ఇమ్రాన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చురకలు

Imran

పాకిస్తాన్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో అక్కడ రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటి వరకు ఆ దేశంలో కేసుల సంఖ్య 1.10 లక్షలు దాటింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైరస్ కట్టడి కోసం సరైన చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ప్రభుత్వానికి పాక్ సుప్రీంకోర్టు చురకలంటించింది. కరోనా వైరస్ ను తేలికగా తీసుకోవద్దని, సీరియస్ గా తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. వైరస్ కట్టడి కోసం తగు చట్టాలను కూడా రూపొందించాలని తెలిపింది. చీఫ్ జస్టిస్ గుల్జార్ అహ్మద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సుప్రీంకోర్టులో ఇద్దరు జడ్జీలు కూడా కరోనా బారిన పడ్డారని, తాము కూడా ఒత్తిడికి లోనవుతున్నామని చెప్పారు. పాక్ ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు.

Related posts