బీజేపీ ఎంపీ శోభ కరంద్లాజే కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. తనకు కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యెడ్యూరప్పతో సంబంధాన్ని అంటగడుతూ కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు విడుదల చేసిన ‘యెడ్డీ డైరీ’లో ఓ దేవస్థానంలో తనను యెడ్యూరప్ప వివాహం చేసుకున్నట్టు పేర్కొనడాన్ని ఆమె తప్పుబట్టారు. తన ఇమేజ్ ను దెబ్బతీసేందుకే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు.
సమగ్ర విచారణ జరిపితే కాంగ్రెస్ విడుదల చేసిన డైరీ పచ్చి బూటకమని..వాస్తవాలు వెలుగు చూస్తాయని శోభ తెలిపారు. నీచ రాజకీయాలకు దిగిన కాంగ్రెస్ కు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. బీజేపీ అగ్రనేతలకు యెడ్యూరప్ప నుంచి ముడుపులు అందాయనే ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. కాంగ్రెస్ తీరు ఇలానే ఉంటే లోక్ సభలో ఆ పార్టీ బలం 44 నుంచి 4కు పడిపోతుందని అన్నారు.
పవన్ పేరుకు తగ్గట్టే గాలి మాటలు: అంబటి