telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

తిరుమల శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు నారా కుటుంబం రూ. 44 లక్షలు విరాళం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు (మార్చి 21, 2026) సందర్భంగా తిరుమల శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు నారా కుటుంబం రూ. 44 లక్షలు విరాళంగా అందజేసింది.

నారా దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఈ సంప్రదాయాన్ని నారా కుటుంబం కొనసాగిస్తోంది.

వెంగమాంబ సత్రం నుంచి పద్మావతి వసతిగృహానికి వెళ్తూ మధ్యలో ఆగిన సీఎం – లేపాక్షి కూడలిలో భక్తులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.

భక్తుల నుంచి చిన్నారిని ఎత్తుకొని ముద్దాడిన సీఎం చంద్రబాబు, టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలు, సమస్యలను భక్తుల నుంచి నేరుగా తెలుసుకున్న సీఎం చంద్రబాబు.

తిరుమలలో భక్తులకు ఒకరోజు జరిగే అన్నప్రసాద వితరణ ఖర్చును (సుమారురూ. 44 లక్షలు) భరించడానికి ఈ నిధులను కేటాయించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి మరియు మనవడు దేవాన్ష్ కలిసి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు.

నారా కుటుంబం ఇప్పటివరకు 12 సార్లు శ్రీవేంకటేశ్వర అన్నప్రసాద ట్రస్టుకు దేవాన్ష్ పేరుతో విరాళాలు అందించడం గమనార్హం.

Related posts