telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఎంపీ రఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు

ఎంపీ రాఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది.ఆయన వేసిన పిటిషన్‌ దాఖలు చేయగా.. కోర్టు పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది.

ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఆయనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో రఘురామ కుమారుడు భరత్, పీఏ శాస్త్రి, సీఆర్‌పీఎఫ్‌ ఏఎస్‌ఐ, కానిస్టేబుల్‌ను నిందితులుగా చేర్చారు.

విధి నిర్వహణలో భాగంగా తాను బౌల్డర్‌హిల్స్‌ వద్ద ఉండగా నలుగురు వ్యక్తులు వచ్చి తనను కారులో ఎక్కించుకొని రఘురామ ఇంట్లోకి నిర్బంధించి , చిత్రహింసలకు గురి చేశారని ఏపీ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ఎస్‌కే ఫరూక్‌ భాషా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో తమపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఎంపీ రఘురామ, ఆయన కుమారుడు భరత్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.

Related posts