telugu navyamedia
నరేంద్ర మోదీ రాజకీయ వార్తలు

ఈ నెల 13న దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి ‘పీఎం కిసాన్’ నిధులను కేంద్ర ప్రభుత్వం జమ చేయనుంది

దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ 22వ విడత నిధులను ఈ నెల 13న రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు వెల్లడించింది.

ప్రధాని నరేంద్ర మోదీ అసోం పర్యటన నేపథ్యంలో శుక్రవారం గువాహటి వేదికగా నిధులు విడుదల చేస్తారని తెలిపింది.

రైతాంగానికి పెట్టుబడి సాయం అందించేందుకు తీసుకొచ్చిన ఈ పథకం కింద కేంద్రం దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఏటా రూ. 6 వేలు అందిస్తోంది.

2019 లో ఎన్డీయే సర్కారు ప్రారంభించిన ఈ పథకంలో భాగంగా ఏటా మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున మొత్తం రూ. 6 వేలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.

శుక్రవారం ప్రధాని మోదీ మొత్తం రూ.19 వేల కోట్ల నిధులను విడుదల చేస్తారు. దీంతో దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 2 వేలు చొప్పున జమ అవుతాయని అధికారులు తెలిపారు.

Related posts