telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు

మార్కాపురం జిల్లా ప్రజలు నారా చంద్రబాబు నాయుడు కు ఘనస్వాగతం పలికారు.

రూ.456 కోట్లతో చేపట్టనున్న వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు దోర్నాల మండలం, గంటవానిపల్లిలో శంకుస్థాపన చేశారు.  బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు.

రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే అందరూ సహకరించాలని అప్పుడు కోరా, రాష్ట్రానికి మేలు చేసేందుకే పవన్ కల్యాణ్, నేను కలిశాం, అరకు నుంచి ప్రకాశం జిల్లా వరకు మనదే హవా.

వచ్చే ఎన్నికల్లో ఒంగోలు, మార్కాపురం జిల్లాల్లో నూరుశాతం స్టెక్‌రేట్ కావాలి. మార్కాపురం జిల్లా చేస్తానని చెప్పా మాట నిలబెట్టుకున్నా మదనపల్లెకు కూడా న్యాయం చేస్తానని చెప్పా చేశాను.

పోలవరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుంది. పోలవరం జిల్లా ఇస్తానని చెప్పా మాట నిలబెట్టుకున్నా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు ఇచ్చాం.

మూడు వరాలు ఇచ్చేందుకు మార్కాపురం వచ్చా,   1995లోనే మార్కాపురం ప్రజల కష్టాలు చూశా, ఇక్కడి రైతులు సాగునీరు లేకుండా అనేక ఇబ్బందులు పడ్డారు. వెలిగొండ ప్రాజెక్టు వల్ల మార్కాపురం జిల్లాకు అనేక లాభాలు.

వెలిగొండ ప్రాజెక్టుతో రైతుల జీవితాలు బాగుపడతాయి,  2014–19 మధ్య వెలిగొండ పనులను పరుగులు పెట్టించాం. 2019-24 మధ్య వెలిగొండ పనులు మూలన పడ్డాయి వెలిగొండ వల్ల 4.35 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.

మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెం నియోజకవర్గాలకు ఎంతో లాభం, ఇక్కణ్నుంచి ఉదయగిరి, బద్వేలుకు కూడా నీరు వెళ్తాయి. వెలిగొండ పనులు పూర్తయ్యాయని అప్పటి సీఎం ప్రారంభించారు.

2020లోనే వెలిగొండ పూర్తవుతుందని చెప్పి మిమ్మల్ని మోసం చేశారు. అప్పటి సీఎం పనులు పూర్తి కాకుండానే రిబ్బన్ కట్ చేశారు. మేం మాత్రం ప్రాజెక్టుల విషయంలో మోసం చేయలేదు చేయదు.

వెలిగొండ ప్రాజెక్టుకు మొత్తం రూ.9,081 కోట్లు కావాలి,  వెలిగొండ ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.5,458 కోట్లు ఖర్చు చేశాం. వెలిగొండను రెండు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించాం. మేం వచ్చాక వెలిగొండకు రూ.540 కోట్లు ఖర్చు చేశాం  ఇవాళ రూ.430 కోట్ల లైనింగ్ పనులకు శంకుస్థాపన చేశాం.

ఇంకా రూ.2,540 కోట్లు ఖర్చు చేస్తే వెలిగొండ పనులు పూర్తవుతాయి, వెలిగొండ పనులు పూర్తయ్యాయని ఇక్కడి రైతులకు పంగనామాలు పెట్టారు. మంచి చేసిన వారికి అండగా ఉంటేనే మీ జీవితాలు మారతాయి.

ప్రతి విషయంలో మీకు అండగా చంద్రన్న ఉంటాడు పేదలకు, రైతులకు, వెనుకబడిన ప్రాంతాలకు అండగా ఉంటా, ఏ పని చేసినా మహిళలను దృష్టిలో పెట్టుకునే చేస్తా, ఆడబిడ్డల్లో చైతన్యం రావాలి.

మగవారితో సమానంగా మీరు సంపాదించాలి, మీరు తయారుచేసిన డ్వాక్రా ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తాం, అన్నదాత సుఖీభవ ఇచ్చి రైతులను ఆదుకుంటున్నాం.

పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. నల్లమలసాగర్‌కు గోదావరి నీరు ఇచ్చేందుకు ప్రయత్నం, పుష్కలంగా సాగునీరు ఇస్తేనే రైతు ఉత్సాహంగా ఉంటాడు గతేడాది హంద్రీనీవా ప్రాజెక్టుపై దృష్టి సారించా, ఈ ఏడాది వెలిగొండ ప్రాజెక్టుపై దృష్టి పెట్టా, మార్కాపురం జిల్లాను ఉద్యానవనంగా తయారుచేస్తాం.

పండ్లతోటల వల్ల రైతుల ఆదాయం బాగా పెరుగుతుంది. నల్లమలసాగర్ నుంచి నీళ్లు తెచ్చి ఇంటింటికీ కుళాయి నీరిస్తాం, మీ భూమి పరిస్థితిని మీ ఫోన్‌లోనే చూసుకోవచ్చు. ఎవరైనా భూ కబ్జాలకు పాల్పడితే తాట తీస్తాం, రాష్ట్రంలో భూ వివాదాలకు స్వస్తి చెబుతాం.

మార్కాపురంలో రూ.50 కోట్లతో కలెక్టరేట్ నిర్మిస్తాం, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే మా లక్ష్యం, పూర్తి పారదర్శకంగా టీచర్లు, పోలీసు పోస్టులు భర్తీ చేశాం. వర్షాలు బాగా పడటంతో భూగర్భ జలాలు పెరిగాయి – 53 టీఎంసీలతో మార్కాపురం జిల్లా మొత్తానికి సాగు, తాగునీరు అందుతుంది.

ఈ ప్రాంతాల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంది అందుకే సురక్షితమైన తాగునీరు ఇస్తాం, చెత్త నుంచి కూడా సంపద సృష్టిద్దాం అని సీఎం చంద్రబాబు ప్రసంగించారు.

Related posts