వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఏపీ సీఎం చంద్రబాబు పై ధ్వజమెత్తారు. సోమవారం కర్నూల్ జిల్లా ఓర్వకల్లులో ఎన్నికల ప్రచారాన్ని జగన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుతో పాటు ఓ మీడియా వర్గంతో కూడ పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ప్రజలకు పిలుపునిచ్చారు. సీఎంతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో అన్నింటితో పోరాటం చేస్తున్నామని అన్నారు. వీళ్లంతా ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా కల్పించి చూపిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు అన్యాయాలు ఇంతటితో ఆగిపోవని ఆయన అభిప్రాయపడ్డారు.
చంద్రబాబునా ఎన్నికల్లో డబ్బులను విచ్చలవిడిగా వెదజల్లే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఇచ్చే డబ్బులను చూసి మోసపోకూడదని ఆయన కోరారు. వైసీపీ అధికారంలోకి వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. తాను ముఖ్యమంత్రి కాగానే బడికి పిల్లల్ని పంపిస్తే రూ. 15 వేలు చెల్లించనున్నట్టు ఆయన హామీ ఇచ్చారు. పాదయాత్ర ద్వారా ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొన్నానని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం వస్తోందని జగన్ పేర్కొన్నారు.