ప్రజా సమస్యలు గాలికొదిలేసి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం.. పాకులాడటమే వైసీపీ ప్రధాన అజెండా.
తాము చేసిన పాపాలు ఎదుటివారిపైకి నెట్టి.. తప్పుడు ప్రచారం చేయటం వైసీపీకి అలవాటుగా మారింది.
తిరుమల కల్తీ లడ్డూలో చేసిన దోపిడీ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే సంబంధం లేని హెరిటేజ్ అంశాన్ని మండలిలో తీసుకొస్తున్నారు.
ఇలాంటి వారికి చట్టసభకు వచ్చే నైతిక అర్హత లేదు, తనకు తాను ఏదో స్వాతంత్య్ర సమరయోధుడిలా అంబటి రాంబాబు ఫీల్ అవ్వటం దౌర్భాగ్యం.
చేసిన వెధవ పనులకు సిగ్గుపడకుండా ఇంకా సమర్ధించుకుంటున్న అంబటి తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు

