ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ ముగిసింది. అరగంటకు పైగా మోదీ, జగన్ భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య సమావేశం దాదాపు 45నిమిషాలపాటు కొనసాగింది. రాష్ట్రంలో ఉన్న పెండింగ్ అంశాలతో పాటు రాష్ట్రపతి ఎన్నికపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.
సీఎం జగన్ వెంట వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఉన్నారు. కాసేపట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్తో జగన్ భేటీ కానున్నారు. రాత్రి 9 గంటల తర్వాత కేంద్రమంత్రి అమిత్షాతో భేటీ కానున్నారు.