telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కలుగట్లలో మీ భూమి- మీ హక్కు కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందిం చిన సీఎం చంద్రబాబు

కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గం, కలుగట్లలో మీ భూమి- మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొని రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందించారు.

అంతకముందు సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి పరిశీలించారు.

అనంతరం ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు.

కలుగొట్ల గ్రామసభలో ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగం రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం, ఇప్పుడు ఇచ్చిన పాస్ పుస్తకాలను ఎవరూ ట్యాంపర్ చేయలేరు.

భూ సమస్యల ఫిర్యాదులు ఇబ్బడిముబ్బడిగా వచ్చాయి, ఎట్టి పరిస్థితుల్లో మీ భూమిపై ఎవరూ కన్నేయకుండా సర్వ హక్కులు కల్పించాం.

క్యూ ఆర్ కోడ్ వల్ల మీ ఫోన్ లోనే మీరు చూసుకోవచ్చు మీ భూమిని ఎవరిపేరుతోనైనా మారిస్తే వెంటనే తెలుస్తుంది. మీ రికార్డులన్నీ కంప్యూటర్ లో భద్రంగా ఉంటాయి ట్యాంపర్ చేస్తే నేరుగా జైలుకే వదిలిపెట్టేది లేదు.

అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టి కఠినంగా శిక్షిస్తాం. మీ రికార్డులన్నీ మీ అనుమతితోనే మార్పు చేస్తాం.

సర్వే చేసేటప్పుడు మీ సమక్షంలోనే అన్నీ జరుగుతాయి. సర్వే తర్వాత పుస్తకం ముంద్రించి మీకు చూపించాకే కొత్త పుస్తకం చిన్న అక్షర దోషం లేకుండా పుస్తకం ముద్రణ జరుగుతుంది.

ఒక్క పైసా అవినీతి లేకుండా పట్టాదార్ పాస్‌పుస్తకం ఇస్తాం, లంచాల వ్యవస్థకు స్వస్తి చెప్పాలనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం 9,500 గ్రామాల్లో సర్వే చేయాలి 62 లక్షల మందికి కొత్తగా ఇచ్చే అవకాశం ఉంటుంది.

భూవివాదాలు లేని రాష్ట్రంగా మార్చే బాధ్యత తీసుకున్నాం, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ పనులు మూడేళ్లలో పూర్తిచేస్తాం. రాష్ట్రానికి జీవనాడి పోలవరాన్ని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు, పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు.

2027 జూన్‌లోపు పుష్కరాల కంటే పూర్తిచేసి జాతికి అంకితం చేస్తాం, నదుల అనుసంధానం జరగాలి.. రాయలసీమకు నీళ్లు రావాలి – తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి కూడా కల్తీ చేశారు.

వేంకటేశ్వరస్వామిని అపవిత్రం చేసే పరిస్థితి తీసుకువచ్చారు. శ్రీశైలంలో కూడా రసాయనాలతో ప్రసాదం కల్తీ చేశారు.

సీబీఐ, సిట్ ఏమీ లేదని చెప్పారని ఆరోపిస్తున్నారు. వివేకాను చంపి నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర చేశారు.

నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఎన్‌డీడీబీ నివేదిక వెల్లడించింది, తిరుమల ప్రసాదం కల్తీ జరిగిందని చాలా మంది ఫిర్యాదు చేశారు.

నేను సీఎం అయ్యాక ప్రిన్సిపల్ సెక్రటరీని నియమించాం టీటీడీ ఈవోను మార్చి మంచి ఆఫీసర్‌ను నియమించాం గతంలో పోలిస్తే లడ్డూలో చాలా వ్యత్యాసం ఉంది అని సీఎం చంద్రబాబు అన్నారు.

కార్యక్రమానికి మంత్రులు అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, టీజీ భరత్, ఎంపీ నాగరాజు, స్థానిక ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts