జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (శుభాకాంక్షలు తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ చిన్నారుల భవిష్యత్కు బంగారు బాటలు వేసేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని సీఎం అన్నారు.
కల్మషం లేని మనసులు చిన్నారులకే సొంతమని నైతిక విలువలతో కూడిన విద్యను అందించడం తప్పనిసరి అని ఉపముఖ్యమంత్రి పవన్ వెల్లడించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు: జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులందరికీ శుభాకాంక్షలు.
రేపటి తరాన్ని అన్నివిధాలా శక్తివంతంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దడం కోసం వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది.
బాలలకు చదువు చెప్పిస్తే అది వారి పరిపూర్ణ వికాసానికి దోహదం చేస్తుంది. అందుకే తల్లికి వందనం పథకం ద్వారా పిల్లలందర్నీ బడికి పంపించేలా ప్రోత్సహిస్తున్నాము.
మధ్యాహ్న భోజన పథకంలో సైతం పిల్లలకు ఇష్టమైన మెనూ ఉండేలా చూస్తున్నాం. అలాగే పిల్లల పథకాలకు స్ఫూర్తి ప్రదాతల పేర్లు పెట్టాం.
ప్రభుత్వ ఆశయాన్ని అర్థం చేసుకుని బాలలందరూ బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తూ మరోసారి చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేసారు.
.
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్: జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు
చిన్నారులందరికీ జాతీయ బాల దినోత్సవ శుభాకాంక్షలు. కల్మషం లేని మనసులు చిన్నారులకే సొంతం. మంచి ఆలోచనలు పెంపొందేలా బాలల చుట్టూ ఆరోగ్యకర వాతావరణం ఉండాలి.
పాఠశాల స్థాయి నుంచి వారికి మనో వికాసం కలిగేలా స్వేచ్ఛాయుతమైన, ఆహ్లాదకరమైన పరిస్థితులు తీసుకురావాలి.
నైతిక విలువలతో కూడిన విద్యను అందించడం తప్పనిసరి. మన దేశ సంస్కృతి సంప్రదాయాల విలువలు తెలియచెప్పాలి.
అప్పుడే భవిష్యత్ పౌరులు సామాజిక బాధ్యత కలిగినవారై, దేశ భక్తిపూరితంగా మనో నిబ్బరంగా ఉంటారు. ఈ బాధ్యతను కూటమి ప్రభుత్వం చేపడుతుంది అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసారు.


తెలంగాణ ఉన్నట్లు సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవు…