telugu navyamedia
ఉద్యోగాలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్​లో మాన్యుఫాక్చరింగ్​ హబ్ ను నెలకొల్పనున్న ఫార్మా దిగ్గజ కంపెనీ ఎలీ లిల్లీ

ప్రపంచంలోనే పేరొందిన ఫార్మా దిగ్గజ కంపెనీ ఎలీ లిల్లీ సుమారు రూ.9 వేల కోట్ల తెలంగాణ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది.

ఈ క్రమంలో దేశంలోనే మొదటిసారిగా తమ మాన్యుఫాక్చరింగ్​ హబ్ హైదరాబాద్​లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది.

ఆ కంపెనీ నిర్ణయంతో ప్రపంచ స్థాయి ఔషదాల తయారీ, సేవల విస్తరణను ఇక్కడి నుంచే నిర్వహించనుంది.

హైదరాబాద్​లోని ఇంటిగ్రేటెడ్​ కమాండ్​ కంట్రోల్​ సెంటర్​లో ఎలీ లిల్లీ అండ్​ కంపెనీ ప్రతినిధులు సోమవారం సీఎం రేవంత్​రెడ్డిని కలిశారు.

ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలోనే పెట్టుబడులకు చిరునామాగా తెలంగాణ మారిందని తెలిపారు.

ఎలీ లిల్లీ అండ్​ కంపెనీ విస్తరణలో భాగంగా భారీ పెట్టుబడులకు ముందుకు రావడం ఆనందకరమని చెప్పారు.

రాష్ట్రంపై నమ్మకం ఉంచినందుకు ఆ కంపెనీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. పెట్టుబడులతో వచ్చే కంపెనీలు, పరిశ్రమలకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా ఎప్పుడూ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.

1961లో ఐడీపీఎల్​ స్థాపించినప్పటి నుంచే హైదరాబాద్​ దిగ్గజ ఫార్మా కంపెనీలకు కేంద్రంగా మారిందన్నారు.

ప్రస్తుతం 40 శాతం బల్క్​ డ్రగ్స్​ ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయని పేర్కొన్నారు. కొవిడ్​ వ్యాక్సిన్లనూ ఇక్కడే తయారు చేశామని, ఫార్మా కంపెనీలను ప్రోత్సహించేలా ఫార్మా పాలసీని ప్రభుత్వం అనుసరిస్తోందని సీఎం తెలిపారు.

జీనోమ్​ వ్యాలీలో ఏటీసీ సెంటర్​ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అక్కడ కావాల్సిన సాంకేతిక సహకారం అందిస్తామని సీఎం వివరించారు.

Related posts