దేవాదుల నుంచి నీటిని విడుదల చేయడంలో రేవంత్ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు.
నాలుగు రోజుల్లో దేవాదుల నీటిని విడుదల చేయాలని.. లేదంటే సీఎం రేవంత్రెడ్డి ఇంటిముందు ధర్నా చేస్తానని ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. ఇవాళ(శుక్రవారం) అదే ప్రాంతంలో ఎర్రబెల్లి పాదయాత్ర చేశారు.
నీటిని విడుదల చేయాలని రేవంత్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పాలకుర్తి మండలం మాదాపురం దంతాలతండా నుంచి ఎర్రబెల్లి దయాకర్రావు పాదయాత్ర ప్రారంభించారు.
పాదయాత్రలో రైతులతో ఎర్రబెల్లి మాట్లాడారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బీఆర్ఎస్ రైతుల పక్షానా పోరాడుతోందని ఉద్ఘాటించారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులకి మేలు చేసిందని చెప్పుకొచ్చారు.
కాగా.. పాలకుర్తిలో వాటర్ వార్ కొనసాగుతోంది. దేవాదుల నీటిపై రాజకీయ రగడ రాజుకుంది.
దేవాదుల నీటి విడుదలపై ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్య దేవాదుల నీటి పంచాయతీ రగులుతోంది.
దేవాదుల నీటిపై విడుదలపై నిన్న(గురువారం) అధికారులతో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి సమావేశం అయ్యారు. నీటిని విడుదల చేయాలని అధికారులను ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఆదేశించారు.

