హైదరాబాద్ శివారులో ఘోర ప్రమాదం జరిగింది.. సంగారెడ్డి జిల్లా పఠాన్చెరు సమీపంలో ఉన్న పాశమైలారంలోని సిగాచి కెమికల్స్లో భారీ పేలుడు సంబంధించింది.
రియాక్టర్ పేలడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు దాదాపు 100 మీటర్ల వరకు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డారు.. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు చనిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది.
20మందికిపైగా కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. కంపెనీలో మంటలు భారీగా ఎగిసిపడినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో గాయపడిన కార్మికుల్ని హుటాహుటిన దగ్గరలో ఉన్న ఆస్పత్రులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు.
ఈ ప్రమాదం తర్వాత మంటలు చెలరేగగా.. కార్మికులు పరుగులు తీశారు. కొందరు కార్మికులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ఈ ఘటన గురించి తెలియగానే కార్మికుల కుటుంబసభ్యులు ప్రమాదం జరిగిన కంపెనీ దగ్గరకు చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గతంలో కూడా పఠాన్చెరు సమీపంలోని ఫ్యాక్టరీలలో ప్రమాదాలు జరిగాయి.