telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

పట్టాభిపై దాడి కేసులో కీలక విషయాలు వెలుగులోకి…

విజయవాడలో టీడీపీ నేత పట్టాభిపై దాడిజరిగిన సంగతి తెలిసిందే.  గుర్తు తెలియని పది మంది దుండగులు అయన కారుపై దాడికి పాల్పడ్డారు.  ఈ దాడిలో పట్టాభి కారు ధ్వంసం అయ్యింది.  ఇనుపరాడ్లతో దాడి చేయడంతో ఆయనకు కూడా స్వల్ప గాయాలయ్యాయి.  దీనిపై పట్టాభి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ కేసులో పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.  సిసి టీవీ ఫుటేజ్ ఆధారంగా దాడికి పాల్పడిన వారిలో ఆరుగురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.  నిందితులని ప్రశ్నించగా ప్రధాన నిందితుడి గురించి ఆరుగురు తెలిపారు.  ప్రధాన నిందితుడు ఆదిత్య సూచనల మేరకే దాడికి పాల్పడినట్టు నిందితులు పోలీసులకు తెలిపారు. ప్రధాన నిందితుడు ఆదిత్యకు, పట్టాభికి ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు దాడి చేయించాడు అనే విషయాలపై దృష్టిపెట్టారు పోలీసులు.  చూడాలి మరి పోలీసులు ఆ నిందితుడిని ఇప్పటివరకు పట్టుకుంటారు అనేది.

Related posts