పెళ్లంటే వధువు మెడలో వరుడు తాళి కడతాడు. ఈ పెళ్లి గురించి వింటే ఇదేమి చోద్యం చెప్మా? అని అనక తప్పదు. ఎందుకంటే ఇక్కడ మాత్రం వరుడి మెడలో వధువు తాళి కట్టింది. ఈ ఘటన కర్ణాటకలోని విజయపుర జిల్లా ముద్దేబిహాళ్ సమీపంలోని నాలతవాడ అనే గ్రామంలో జరిగింది. సోమవారం నాడు ఈ గ్రామంలో రెండు పెళ్లిళ్లు జరుగగా, రెండింటా, వధువలే తాళిని తీసుకుని వరుడి మెడలో కట్టారు.
ప్రభురాజ్ అనే పెళ్లి కొడుకును అంకిత, అమిత్ అనే వరుడిని ప్రియా వివాహమాడారు. ఈ పద్ధతేంటని ప్రశ్నించిన వారికి సమాధానం ఇచ్చిన వారు, ఇదే అసలు సిసలైన బసవణ్ణ సిద్ధాంతమని, 12వ శతాబ్ద కాలంలో ఈ పద్ధతే ఉండేదని వారు చెబుతున్నారు. వినూత్నంగా జరిగిన ఈ వివాహ మహోత్సవానికి పలువురు ఆధ్యాత్మికవేత్తలు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. మీరు తెలుసుకోండి, బాగుందనిపిస్తే, ఫాలో అయిపోండి. ఏమైనా కొత్త ట్రెండ్ కదా.. ! పాతదే అయినా కొత్తది అయిపోయింది.
అన్నాడీఎంకే అధినేత శశికళ… కార్తీ చిదంబరం వ్యాఖ్యలు