గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన స్కేటింగ్ క్రీడాకారిణి జెస్సీరాజ్ ను ప్రతిష్ఠాత్మక ‘ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కార్ – 2025’ వరించింది.
ప్రతి ఏటా దేశ వ్యాప్తంగా వివిధ అంశాల్లో ప్రతిభ చూపిన 25 మంది చిన్నారులకు కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందిస్తుంది.
ఆమె సాధించిన విజయాలు ఏపీకి గర్వకారణమని చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆమె అవార్డును అందుకోబోతున్నారని తెలిపారు.
9 ఏళ్ల వయసులో ఆమె స్కేటింగ్ రంగంలో తన ప్రయాణాన్ని ప్రారంభించిందని ఆమె పట్టుదల, అంకితభావం ఆమెను ఈరోజు గొప్ప గౌరవాన్ని అందుకునే స్థాయికి తీసుకొచ్చిందని కొనియాడారు.
ఎంతో మంది యువ క్రీడాకారులకు ఆమె ఒక స్ఫూర్తి అని ఎక్స్ వేదికగా తెలిపారు.
ఇటీవల జరిగిన 62వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్స్ లో సోలో డ్యాన్స్ లో ఆమె సిల్వర్ మెడల్ సాధించారు.
ఓట్ల తొలగింపు కుట్రలను భగ్నం చేశాం: చంద్రబాబు