మహానటి ఫేమ్ తో కీర్తి సురేశ్ తమిళంలో వరుస సినిమాలు చేస్తోంది. తెలుగు నుంచి తనకి నచ్చే కథ కోసం వెయిట్ చేస్తోంది. ఇక హిందీపై కూడా ఒక లుక్ వేసిందనే విషయం ఇటీవలే ప్రచారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే హిందీలో అజయ్ దేవగణ్ సినిమాలో ఆమె హీరోయిన్ గా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి.
ఈ సినిమా ‘బధాయి హో’ ఫేమ్ దర్శకుడు అమిత్ శర్మ .. బోని కపూర్ కాంబినేషన్ లో రూపొందుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్త నిజమేననేది తాజా సమాచారం. ఫుట్ బాల్ కోచ్ ‘సయ్యద్ అబ్దుల్ రహీమ్’ జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా నిర్మితమవుతుందట. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలోనే కథానాయికగా కీర్తి సురేశ్ కనిపించనుంది. జూన్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. తొలి సినిమాతోనే బాలీవుడ్ లో మంచి పేరు రావడం ఖాయమనే బలమైన నమ్మకంతో కీర్తి సురేశ్ ఉన్నట్టుగా తెలుస్తోంది.