శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టణంలోని శ్రీనివాస నగర్ కాలనీలో అక్రమంగా నిర్మించారంటూ 52ఇళ్లను రెవెన్యూ , మున్సిపల్ అధికారులు పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలకు సిద్దపడ్డారు.
జేసీబీలతో ఇళ్ల కూల్చివేత కోసం వెళ్లిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. అయితే ఇలా కూల్చివేస్తున్న ఇళ్లన్ని టిడిపి నాయకులు, వారికి సంబంధించిన వారివేనని… వైసిపి ప్రభుత్వం కక్షతోనే ఇళ్ల కూల్చివేతకు దిగిందంటూ టిడిపి నాటియకులు ఆరోపించారు. ఇళ్ళను కూల్చివేతను అడ్డుకున్న టిడిపి నాయకులు అర్థరాత్రి ఆందోళనకు దిగారు.
అధికార విపక్ష కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకోవడంతో భారీగా పోలీసులు మోహరించారు. ఇదే సమయంలో టీడీపీ కార్యకర్తలకు మద్దతుగా ఇచ్ఛాపురం టీడీపీ ఎమ్మెల్యే బెందాలం అశోక్ అక్కడికి వచ్చారు. కార్యకర్తలకు సంఘీభావం తెలిపే క్రమంలో ఎమ్మెల్యే అశోక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇదే సమయంలో టీడీపీ కార్యకర్తలకు మద్దతుగా ఇచ్చాపురం టిడిపి ఎమ్మెల్యే బెందాలం అశోక్ ఆందోళనకు దిగారు. టిడిపి, వైసిపి నాయకులు అక్కడికి భారీగా చేరుకుని పోటాపోటీగా నినాదాలు చేసారు. కార్యకర్తలకు సంఘీభావం తెలిపే క్రమంలో ఎమ్మెల్యే అశోక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి


హైదరాబాద్లో కరెంటే ఉండటం లేదు..నేను అనుభవించా ..