*ఎంపీ గోరెంట్ల వీడియో పై సజ్జల రియాక్షన్..
*వీడియోపై ఎంపీ ఫిర్యాదు చేశారు..విచారణ జరుగుతోంది..
*వీడియో మార్పింగ్ కాదని తేలితే కఠిన చర్యలు ఉంటాయి..
హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఆయనపై తీవ్ర వ్యతిరేకతవ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… వీడియోపై గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేశారని.. విచారణ జరుగుతోందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
తన వీడియోను మార్ఫింగ్ చేశారని ఆయన చెబుతున్నారని సజ్జల అన్నారు. అది మార్ఫింగా కాదా అనే అంశం విచారణలో తేలుతుందన్నారు. ఇలాంటి వాటిని తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని స్పష్టం చేశారు
ఆ వీడియో మార్ఫింగ్ కాదని తేలితే మాధవ్పై పార్టీపరంగా చర్యలు తీసుకుంటామని సజ్జల స్పష్టం చేశారు.అంతేకాకుండా ..అందరికీ ఒక గుణపాఠంలా చర్యలు ఉంటాయని సజ్జల పేర్కొన్నారు. చేసిన పనిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని రామకృష్ణారెడ్డి తెలిపారు.