హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ ముఖ్యనేతలు, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్చార్జ్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో నూతన నాయకత్వం టీడీపీకి అవసరం ఉందన్నారు.తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పునర్ నిర్మాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.
నాయకత్వ లోపాన్ని సరిదిద్దుకుందామన్నారు. 119 నియోజకర్గాల్లో పార్టీని బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ పుట్టింది హైదరాబాద్లోనేనని గుర్తుచేశారు. నాయకులు పార్టీనీ వీడుతున్నప్పటికీ, కార్యకర్తలే టీడీపీకి బలమని చెప్పుకొచ్చారు. 9 నెలల తర్వాత చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్భవన్కు వచ్చిన చంద్రబాబుకు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.