*ఝార్ఖండ్లో దారుణం
*రాంచీలో మహిళా ఎస్ఐని దారుణ హత్య
*వాహనంతో ఢీకొట్టి మహిళా ఎస్సై హత్య
ఝార్ఖండ్లో దారుణం చోటుచేసుకుంది. రాంచీలో నేరస్థులు మహిళా ఎస్సైని వాహనంతో ఢీకొట్టి దారుణంగా హత్య చేశారు.
మృతురాలు సంధ్యా టోప్పో అనే మహిళ తుపుదానా పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి ఓ చెక్పాయింట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న సమయంలో దారిలో వెళ్తున్న ఓ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులను పట్టించుకోకుండా నిందితులు వాహనాన్ని ముందుకు పోనిచ్చారు.
దీంతో సబ్ ఇన్స్పెక్టర్ సంధ్యపై నుంచి వాహనం దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయారు
మంగళవారం రాత్రి ఓ చెక్పాయింట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న సంధ్య.. దారిలో వెళ్తున్న ఓ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు.
అయితే, పోలీసులను పట్టించుకోకుండా నిందితులు.. వాహనాన్ని ముందుకు పోనిచ్చారు. ఈ క్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ సంధ్యపై నుంచి వాహనం దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను రిమ్స్కు తరలించగా.. అక్కడే ప్రాణాలు కోల్పోయారు. హరియాణాలో డీఎస్పీ హత్య జరిగిన మంగళవారమే ఈ ఘటన కూడా జరిగింది.