జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేపు కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లు జువైనల్ హోంలో కొట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వంటే నువ్వేనంటూ ఐదుగురు మైనర్లు ఒకరిపై ఒకరు ప్లేటతో దాడి చేసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.
ఓ మీడియా ఛానల్లో వచ్చిన కథనం ప్రకారం.. బాలికను ట్రాప్ చేద్దామని నువ్వే అన్నావని కార్పొరేటర్ కుమారుడు టార్గెట్గా ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. అతణ్ని టార్గెట్ చేసుకుని మిగిలిన నలుగురు దాడి చేశారు. అతను తిరగబడి వీరిపై దాడి చేసినట్లు తెలుస్తోంది.
చివరకు పోలీసులు, జువైనల్ హోం అధికారుల జోక్యంతో వారికి సర్ది చెప్పి ఈ వివాదం సద్దుమణిగేలా చేసినట్లుగా సమాచారం. ఈ ఘటనతో నిందితులు ఉన్న జువెనైల్ హోమ్ కు పోలీసులు భద్రత పెంచారు.
కాగా..జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై గ్యాంగ్రేప్ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మలిక్ పోలీసుల కస్టడీ ఎమ్మెల్యే కుమారుడు, కార్పొరేటర్ కుమారుడు వల్లే ఈ రేప్ జరిగినట్లు వెల్లడించినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో నాలుగు రోజులు కస్టడీ ఉన్న ఏ-1 నిందితుడు సాదుద్దీన్ నిబ్బుకపోయే విషయాలు బయటపెట్టాడు. కార్పొరేటర్ కుమారుడు అసలు సూత్రధారి అని సాదుద్దీన్ పోలీసులకు వివరించాడు. కార్పొరేటర్ కుమారుడు, ఎమ్మెల్యే కొడుకు పబ్లోకి ఎంటర్ కాగానే అమ్మాయిలను వెతకడం ప్రారంభించారని, పబ్లోనూ మైనర్ అమ్మాయిలను వేధించినట్లు పేర్కొన్నాడు.
పబ్ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే కొడుకు, కార్పొరేటర్ కొడుకు మైనర్ వెంట పడ్డారు. వద్దని వారించినా మమ్మల్ని బెదిరించాడని తెలిపారు. దీంతో నన్ను బెంజ్ కారులో ఎక్కొద్దని ఎమ్మెల్యే కొడుకు ఆదేశించాడు. నన్ను పబ్ దగ్గర వదిలి అమ్మాయిని బెంజ్ కారులో ఎక్కించుకున్నాడు. నేను బెంజ్ కారులో కాకుండా ఇన్నోవాలో బేకరికి వెళ్లాను. బెంజ్ కారులోకి ఎక్కగానే మైనర్ అమ్మాయిని ఏమ్మెల్యే కుమారుడు వేధించడం ప్రారంభించాడు.
రన్నింగ్ కారులో ఇద్దరు అత్యాచారం..ఆ తరువాత నిర్మానుష ప్రాంతంలో మరో ముగ్గురు అత్యాచారం చేసినట్లు వెల్లడించారు. నా ఫ్రెండ్స్ బలవంతం కారణంగానే నేనూ ఈ అత్యాచారం చేయాల్సి వచ్చిందని సాదుద్దీన్ పోలీసుల ముందు తెలిపాడు.మరోవైపు సాదుద్దీన్ మాలిక్ రెచ్చగొట్టడం వల్లే తాము బాలికపై అత్యాచారం చేశామంటూ మైనర్లు పోలీసులకు చెబుతున్నారు.