ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్సీ మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం పోస్టు మార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. సుబ్రమణ్యానిది ముమ్మాటికీ హత్యేనని నిర్ధారించారు.
కాకినాడ బీచ్ లో సుబ్రమణ్యాన్ని కొట్టి చంపినట్టుగా అనుమానిస్తున్నారు.మృతుడి ఒంటిపై బీచ్ లో మట్టి, ఇసుక, ఒంటిపై కాళ్లతో తన్నిన గుర్తులున్నాయని పోస్టుమార్టం నివేదికలో గుర్తించారు
ముఖ్యంగా డ్రైవర్ సుబ్రమణ్యం శరీరంలో అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు.
ఇప్పటికే ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ను పోలీసులు ఎ-1 నిందితుడిగా ప్రకటించారు. అనుమానస్పద మృతి కేసును కాస్తా.. హత్యకేసుగా మార్చారు.
దీంతో ఎమ్మెల్సీ అనంతబాబు కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు తెలిపారు. అరెస్ట్ చేసిన వెంటనే వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.
తన భర్త మృతదేహానికి పోస్టుమార్టం చేయడానికి ముందుగా ఎమ్మెల్సీని అరెస్టు చేయాలంటూ సుబ్రహ్మణ్యం భార్య రెండురోజులుగా పోరాడుతున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ అనంతబాబు కు వివాహేతర సంబంధాలు బయట పడతాయనే ఉద్దేశ్యంతోనే సుబ్రమణ్యాన్ని హత్య చేశారని మృతుడి భార్య ఆరోపిస్తున్నారు.