*జనసేన పార్టీ ఆవిర్భావ సభ ప్రారంభం..
*మంగళగిరి జనసేన పార్టీ ఆవిర్భావ సభ
*పవన్ కళ్యాణ్ స్పీచ్పై ఉత్కంఠ
*జనసైనికులతో నిండిపోయిన సభా ప్రాంగణం
*రాష్ట్రభవిష్యత్పై దిశా నిర్దేశం..
అమరావతి . జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏపీ గుంటూరు జిల్లా ఇప్పటంలో ప్రారంభమైంది. ఈ బహిరంగ సభకు జనసైనికులతో పాటు భారీగా ప్రజలు తరలివచ్చారు.
పార్టీ ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తైన సందర్భంగా భారీ సభను నిర్వహిస్తున్నారు. జనసేన ఆవిర్భావ సభా ప్రాంగణానికి దామోదరం సంజీవయ్య చైతన్య వేదిక అని నామకరణం చేశారు.
ఈ సభకు అధ్యక్షుడు పవన్కల్యాణ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు సభకు హాజరయ్యారు.
సభలో పార్టీ కార్యకర్తలకు పవన్కల్యాణ్ దిశానిర్దేశం చేస్తారు.జనసేనపై వస్తున్న విమర్శలకు తాము ఈ సభా వేదికగా సమాధానం చెప్పనున్నామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
48 పేజీలలో 31 కేసులు.. జగన్ నేరచరిత్రకు రుజువు: చంద్రబాబు