*మరో వివాదంలో బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి ఫ్యామిలీ..
*రూ.21లక్షల అప్పు చెల్లించాలేదంటూ ఫిర్యాదు..
బాలీవుడ్ సుందరి శిల్పాశెట్టి వరుస వివాదాలతో చిక్కుకుంది. రుణం ఎగ్గొట్టిన కేసులో ముంబయి కోర్టు శిల్పశెట్టితో పాటు ఆమె తల్లి, సోదరికి కూడా నోటీసులు జారీ చేసింది
2015లో శిల్పాశెట్టి తండ్రి సురేంద్ర శెట్టి రూ. 21 లక్షల డబ్బును ఆటోమొబైల్ ఏజెన్సీ యజమాని పర్హాద్ అమ్రా దగ్గర తీసుకున్నారు..ఆరోపించిన మొత్తాన్ని జనవరి 2017 నాటికి తిరిగి చెల్లించాల్సి ఉంది. అయితే సురేంద్ర శెట్టి చనిపోగా, ఈ ముగ్గురు అప్పును తిరిగి చెల్లించడానికి నిరాకరిస్తున్నారు.
తీసుకున్న ఆ డబ్బును తిరిగి చెల్లించడం లేదని జుహు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రుణం ఎగ్గొట్టిన కేసులో శిల్పశెట్టితో పాటు ఆమె తల్లి, సోదరికి కూడా సమన్లు జారీ చేసింది.
శిల్పాశెట్టి కుటుంబం ఇప్పటికే అనేక కష్టాలను ఎదుర్కొంటుంది. గత ఏడాది జూన్లో తన భర్త రాజ్కుంద్రా అరెస్టు కారణంగా శిల్పాశెట్టి కుంద్రా కూడా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.